Share News

అందరినీ కలుపుకొని ముందుకెళ్తా: కొండపల్లి శ్రీనివాస్‌

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:20 AM

తనకు టిక్కెట్‌ ఇవ్వడంపై గజపతినగరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ ఆనందం వ్యక్తం చేశారు.

అందరినీ కలుపుకొని ముందుకెళ్తా: కొండపల్లి శ్రీనివాస్‌
శ్రీనివాస్‌కు అభినందనలు తెలుపుతున్న టీడీపీ నాయకులు

గంట్యాడ: తనకు టిక్కెట్‌ ఇవ్వడంపై గజపతినగరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ ఆనందం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం గంట్యాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి జాబితాలో తన పేరు ఉండడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇక నుంచి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొంటూ ముందుకు వెళ్తానని తెలిపారు. వైసీపీని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నార న్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన విజయం సాధిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, టీడీపీ నాయకులు ఉన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:20 AM