టీడీపీలోకి 150 కుటుంబాల చేరిక
ABN , Publish Date - Jan 28 , 2024 | 12:15 AM
పసుపాం పంచాయతీలో సుమారుగా 150 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి.
![టీడీపీలోకి 150 కుటుంబాల చేరిక](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పూసపాటిరేగ: పసుపాం పంచాయతీలో సుమారుగా 150 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. వైసీపీకి చెందిన మాజీ సర్పంచ్ కంది వెంకటరమణతో పాటు పంచాయతీ సభ్యులు ఐదుగురు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరారు. వీరిని మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు, పార్టీ మండల అధ్యక్షుడు మహంతి శంకరరావు తదితరులు ఆహ్వానించారు. ఈసందర్భంగా బంగార్రాజు మాట్లాడుతూ వైసీపీతో విసిగిసోయిన ప్రజలు టీడీపీ విధానాలకు ఆకర్షితులై భవిష్యత్తులో పెద్దఎత్తున చేరుతారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్, అప్పలనా రాయణ, పార్టీ నాయకులు పిన్నింటి సన్యాశినాయుడు, ఇజ్జురోతు ఈశ్వరరావు, ఆకిరి ప్రసాదరావు, దంగా భూలోక, తదితరులు పాల్గొన్నారు.