కాలువలు ఇలా?.. సాగునీరు ఎలా?..
ABN , Publish Date - May 21 , 2024 | 11:10 PM
మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాల పరిధిలోని 24,700 ఎకరాలకు సాగునీరు అందించే వెంగళరాయసాగర్ కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి.
![కాలువలు ఇలా?.. సాగునీరు ఎలా?..](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మక్కువ: మక్కువ, సీతానగరం, బొబ్బిలి మండలాల పరిధిలోని 24,700 ఎకరాలకు సాగునీరు అందించే వెంగళరాయసాగర్ కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో శివారు ఆయకట్టు భూములకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభంకానుంది. వెంగళరాయ సాగర్ జలాశయం ద్వారా వచ్చే సాగునీరే రైతులకు ఆధారం. అయితే, గత మూడేళ్లుగా ఈ కాలు వల్లో పూడికలు తీయకపోవడంతో శివారు భూములకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. జైకా నిధులతో చేపడుతున్న వెంగళరాయ సాగర్ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాలువల నిర్వహణ స క్రమంగా లేక ఏటా రైతులు శ్రమదానంతో వాటిని బాగు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇప్పటికైనా ఇరిగేషన్శాఖ అధికారులు స్పందించి ఖరీఫ్ సీజన్కు ముందుగానే కాలువలను బాగు చేయాలని రైతులు కోరుతున్నారు.