ఉపాధ్యాయుల కుటుంబాలకు బాసట
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:03 AM
సరాయివలస కొండవాగు గెడ్డలో ఇటీవల కొట్టుకొనిపోయి మృతి చెందిన ఉపాధ్యాయులు ఆర్తీ, మహేష్ కుటుంబాలకు ప్రభుత్వం బాసట గా నిలిచింది.
సాలూరు: సరాయివలస కొండవాగు గెడ్డలో ఇటీవల కొట్టుకొనిపోయి మృతి చెందిన ఉపాధ్యాయులు ఆర్తీ, మహేష్ కుటుంబాలకు ప్రభుత్వం బాసట గా నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం విలే కరులతో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సాను భూతిని తె లియజేశారు. ఆయా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కేంద్రప్రభుత్వం నుంచి రూ.పది లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.ఐదు లక్షలు ఆర్థిక సహాయం కూటమి ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు.