ఘనంగా బాబూ జగ్జీవన్రామ్ జయంతి
ABN , Publish Date - Apr 05 , 2024 | 11:18 PM
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతిని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
![ఘనంగా బాబూ జగ్జీవన్రామ్ జయంతి](https://media.andhrajyothy.com/media/2024/20240326/5_vzm_coll_1_5bcc3bc264.gif)
కలెక్టరేట్, ఏప్రిల్ 5: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతిని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డీఆర్వో అనతి, ఇతర అధికారులు జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ జాతికి చేసిన సేవలను, ఆయన జీవిత విశేషాలను జేసీ వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, మెప్మా పీడీ సుధాకర్, జడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధరాణి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామానందం, తదితరులు పాల్గొన్నారు.