నేటి నుంచి రాష్ట్రానికి మంచి రోజులు
ABN , Publish Date - Jun 03 , 2024 | 11:59 PM
‘నేటి నుంచి రాష్ట్రానికి మంచి రోజులు ప్రారంభమవుతాయ’ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు.
![నేటి నుంచి రాష్ట్రానికి మంచి రోజులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చీపురుపల్లి: ‘నేటి నుంచి రాష్ట్రానికి మంచి రోజులు ప్రారంభమవుతాయ’ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. సోమవారం ఆయన చీపురుపల్లిలో స్థానిక విలేకర్లతో మాట్లాడారు. నేటి ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కాబోతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 95 శాతం ఎగ్జిట్ పోల్స్, సర్వేలు కూటమికి అనుకూలంగా ఉన్నాయన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. విజయనగరం పార్లమెంటు స్థానంతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూటమి గెలుపు ఖాయమని ఆయన అన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, లెక్కింపు పూర్తయ్యే వరకూ సెంటర్లను విడిచి వెళ్లరాదని ఆయన సూచించారు.