Share News

ఉపాధి కోసం వెళ్లి..

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:21 AM

ఉపాధి కోసం ఊరికాని ఊరు వెళ్లి, అక్కడ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు.

ఉపాధి కోసం వెళ్లి..

సాలూరు రూరల్‌: ఉపాధి కోసం ఊరికాని ఊరు వెళ్లి, అక్కడ రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. కొట్టుపరువు గ్రామానికి చెందిన చింతాడ అజయ్‌(30) గత కొన్నేళ్ల కిందట ఉపాధి కోసం కృష్ణ జిల్లాలో కైకలూరు వెళ్లాడు. అక్కడ చేపల చెరువులో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి కూర కోసం బైకుతో పట్టణంలోకి వెళ్తుండగా, పశువులు అడ్డంగా వచ్చాయి. వాటిని తప్పిస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గుడివాడలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కొట్టుపరువుకు తీసుకొస్తున్నారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు ప్రకాష్‌, బుచ్చమ్మ రోదిస్తున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:21 AM