Share News

ఒక్క అవకాశం ఇవ్వండి: జయకృష్ణ

ABN , Publish Date - May 03 , 2024 | 11:55 PM

ఒక్క అవకాశం ఇవ్వండి.. పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కోరారు.

ఒక్క అవకాశం ఇవ్వండి: జయకృష్ణ

సీతంపేట: ఒక్క అవకాశం ఇవ్వండి.. పాలకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కోరారు. మండలంలోని కొత్తడి, మధ్యతొత్తడి, కిండంగి గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు నిమ్మక చంద్రశేఖర్‌, సవర గంగయ్య, కుండంగి శ్రీకాంత్‌, ఉపేంద్ర, పాలక ఆదినారాయణ, లక్ష్మణరావు, నిమ్మక కాంతారావు, సవర కృష్ణ, నిమ్మక కృష్ణ, నిమ్మక రోజా, దమయంతి తదితరులున్నారు. అలాగే అంటికొండ, అచ్చెబ గ్రామాల్లో జయకృష్ణకు మద్దతుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి ఇంటింటా ప్రచారం చేశారు. గ్లాసు గుర్తుకు ఓటువేసి జయకృష్ణను గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.

వీరఘట్టం: మండలంలోని వీరఘట్టం మేజర్‌ పంచాయతీలో శుక్రవారం టీడీపీ, జనసేన కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సూపర్‌సిక్స్‌ పథకాలతో ప్రతిఒక్కరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి నిమ్మక జయకృష్ణను, కమలం గుర్తుపై ఓటు వేసి కొత్తపల్లి గీతను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జామి లక్ష్మీనారాయణ, బల్ల హరి, మహేష్‌, ప్రవీణ్‌ తదితరులున్నారు.

పాలకొండ: నగర పంచాయతీలోని గారమ్మకాలనీలో ఎరుకుల వీధికి చెందిన సుమారు 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంటా సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో వీరంతా పసుపు కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు గ్లాసు గుర్తుపై, ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అంపోలు శ్రీనివాసరావు, సుంకరి అనీల్‌దత్‌, శాసపు రాంబాబు, దుప్పాడ వెంకటరమణ, ఉదయాన చంద్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2024 | 11:55 PM