Share News

మొయిద నారాయణపట్నంలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:07 AM

మొయిద నారాయణపట్నంలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదవ శాత్తు ఓ పూరిపాకకు నిప్పు అంటుకోవడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

మొయిద నారాయణపట్నంలో అగ్ని ప్రమాదం

నెల్లిమర్ల: మొయిద నారాయణపట్నంలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదవ శాత్తు ఓ పూరిపాకకు నిప్పు అంటుకోవడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గీత కార్మికుడు రమేష్‌, లక్ష్మికి చెందిన పూరిపాక దగ్ధమైంది. రూ.30వేల నగదు, రూ.50వేలు విలువగల మేకలతో పాటు ఇంటిలో ఉన్న సా మగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అలాగే పక్కనే ఉన్న పతివాడ సత్యంకు చెందిన పశువుల శాల, గడ్డి వాము దగ్ధమయ్యాయి. మొత్తం ఈ ప్రమాదంలో రూ.2 లక్షలు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. స్థానిక యువకులు మంట లు వ్యాపించకుండా అదుపుచేశారు. అనంతరం అగ్నిమాపక శాఖకు సమాచా రం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి, ప్రమాద తీవ్రత తగ్గించారు. స్థానిక యువకులు రూ.50వేలు సేకరించి, సర్పంచ్‌ అట్టాడ కృష్ణ సమక్షంలో బాధితుడు రమేష్‌ కుటుంబానికి అందించారు.

Updated Date - Feb 28 , 2024 | 12:07 AM