గ్రామాలో ఫీవర్ సర్వే
ABN , Publish Date - May 12 , 2024 | 12:22 AM
గ్రామాల్లో పీవర్ సరే ్వ చేపట్టి జ్వర లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలని జిల్లా మలేరియా అధికారి (డీఎంవో) టి.జగన్మోహన్రావు ఆదే శించారు.

కొమరాడ: గ్రామాల్లో పీవర్ సరే ్వ చేపట్టి జ్వర లక్షణాలు ఉన్న వారిని గుర్తించాలని జిల్లా మలేరియా అధికారి (డీఎంవో) టి.జగన్మోహన్రావు ఆదే శించారు. శనివారం ఆయన శివిని గ్రామాన్ని సందర్శిం చారు. అక్కడ వైద్య సిబ్బంది చేపడుతున్న ఆరోగ్య పరీక్షలను పరిశీలించారు. పీవర్ సర్వేలైన్స్, డ్రై డే కార్యక్రమాల నిర్వహణ, వాటి నమోదు వివరాలపై ఆరా తీశారు. సికిల్ సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలను పరిశీలించారు. గ్రామంలో ఫ్రైడే డ్రైడే ఏ మేరకు నిర్వహి స్తున్నారో గమనించాలని, దోమల లార్వా గుర్తించడంలో దృష్టి సారించాలని సూచించారు. సర్వేలో సేకరించిన రక్త పూతల స్లైడ్స్ను ల్యాబ్లో త్వరగా పరీక్షలు జరిపి నివేదికలు అందించాలన్నారు. అనంతరం గర్భిణుల గృహ సందర్శన చేసి ఆరోగ్య పరిశీలన చేశారు. డీహైడ్రేషన్కు గరికాకుండా తగు జాగ్రత్తలు సూచించారు. అవసరమైన మందులు, నిర్ధారణ పరీక్షలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ పరిశీలనలో సీహెచ్ఎన్ విజయకుమారి, వైద్య సిబ్బంది ప్రమీల, లత, రామకృష్ణ, రమేష్, ఆశకార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.