Share News

సంయమనం పాటించండి: డీఎస్పీ కృష్ణారావు

ABN , Publish Date - May 24 , 2024 | 11:43 PM

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో పది రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు సంయమనంతో ఉండాలని పాలకొండ డీఎస్పీ జీవీ కృష్ణారావు కోరారు.

సంయమనం పాటించండి: డీఎస్పీ కృష్ణారావు

జియ్యమ్మవలస: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో పది రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలు సంయమనంతో ఉండాలని పాలకొండ డీఎస్పీ జీవీ కృష్ణారావు కోరారు. చినమేరంగి, కుదమ గ్రామాల్లో ఆయన శుక్రవారం ప్రజలతో మాట్లాడారు. జూన్‌ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో గ్రామాల్లో గొడవలకు తావివ్వరాదని, అందరూ కలిసిమెలిసి సోదరభావంతోనే మెలగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చినమేరంగి సీఐ బి.మంగరాజు, ఎస్‌ఐ ఇ.చిన్నంనాయుడు, పోలీస్‌ సిబ్బంది, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 11:43 PM