Share News

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:03 AM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ విజయానికి దోహదపడాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.

ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

సాలూరు: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ విజయానికి దోహదపడాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. సాలూరులోని తన నివాసంలో సోమవారం ఆమె నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, యూనిట్‌ ఇన్‌చార్జిలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. అనంతరం పట్టణంలోని 15వ వార్డు పెదయాత వీధి, కుమ్మరి వీధులలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి, మేనిఫెస్టోను వివరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, అక్యాన అప్పారావు, యాసర్ల అప్పారావు, అల్లం శ్యామల, బలగ పైడిరాజు, రమాదేవి, కనకారావుతో పాటు పలువురు టీడీపీ జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 12:03 AM