మొదలైన టెన్త్ పరీక్షలు
ABN , Publish Date - Mar 18 , 2024 | 11:52 PM
ఉరుకులు, పరుగులతో పది పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. ముందుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆలయాలకు వెళ్లి పూజలు చేశాక పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.
![మొదలైన టెన్త్ పరీక్షలు](https://media.andhrajyothy.com/media/2024/20240313/DSC_0089_ac9de1b471.gif)
మొదలైన టెన్త్ పరీక్షలు
మొదటి రోజున 574 మంది విద్యార్థులు పరీక్షకు దూరం
కలెక్టరేట్, మార్చి 18: ఉరుకులు, పరుగులతో పది పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. ముందుగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆలయాలకు వెళ్లి పూజలు చేశాక పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి రోజున తెలుగు పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 129 కేంద్రాల్లో 24,726 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 24,152 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 574 మంది దూరంగా ఉన్నారు. 97.68 శాతం హాజరు నమోదైంది. స్క్వాడ్ సిబ్బంది 49 కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమకుమార్ 10 పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
-----------