Share News

ఉమ్మడి జిల్లాలో 91 విద్యుత్‌ ఫీడర్ల ఏర్పాటు

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:58 PM

ఉమ్మడి జిల్లాలో నిరంతర విద్యుత్‌కు 91 విద్యుత్‌ ఫీడర్లు ఏర్పాటు చేయనున్నామని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎం.లక్ష్మణరావు తెలిపారు.

 ఉమ్మడి జిల్లాలో 91 విద్యుత్‌ ఫీడర్ల ఏర్పాటు

సాలూరు రూరల్‌, మార్చి 4: ఉమ్మడి జిల్లాలో నిరంతర విద్యుత్‌కు 91 విద్యుత్‌ ఫీడర్లు ఏర్పాటు చేయనున్నామని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎం.లక్ష్మణరావు తెలిపారు. సోమవారం సాలూరు విచ్చేసిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఉమ్మడి జిలాల్లఓ ఇప్పటికే 25 ఫీడర్ల పనులు ప్రారంభించామన్నారు. ఆయా పనులన్నీ పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకు 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా జరుగుతుందన్నారు. సాలూరు టిడ్కోలో ఇళ్ల విద్యుత్‌ కోసం రూ. 3.85 కోట్లతో సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేశామన్నారు. బాగువలస ఫీడర్‌లో 24 గంటల విద్యుత్‌ సరఫరాకు కార్యాచరణ సిద్ధం చేశామని వెల్లడించారు. ఏపీఈపీడీసీఎల్‌ డీఈ రంగారావు, ఏఈ సింహాచలం తదితరులున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:58 PM