ఎన్నికలు విజయవంతం
ABN , Publish Date - Jun 07 , 2024 | 11:59 PM
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ నిశాంత్కుమార్ తెలిపారు. సజావుగా, నిష్పక్షపతంగా ఎన్నికలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులు, సహకరించిన సిబ్బందికి అభినందనలు తెలిపారు.

పార్వతీపురం, జూన్7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ నిశాంత్కుమార్ తెలిపారు. సజావుగా, నిష్పక్షపతంగా ఎన్నికలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులు, సహకరించిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలతో సహా జిల్లా అధికారులంతా సమన్వయంతో పనిచేశారని తెలిపారు. వారికి శాఖాపరంగా, వ్యక్తిగతంగా అప్పగించిన విధులను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించడం సంతోషకదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ శోభిక, పార్వతీపురం ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.