యువత భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ మాఫియా
ABN , Publish Date - Mar 26 , 2024 | 12:01 AM
యువత భవిష్యత్తును జగన్ డ్రగ్స్ మాఫియా చిదిమేస్తోందని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి విమర్శించారు.
![యువత భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ మాఫియా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నెల్లిమర్ల: యువత భవిష్యత్తును జగన్ డ్రగ్స్ మాఫియా చిదిమేస్తోందని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి విమర్శించారు. నెల్లిమర్ల లో సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో మొదటి స్థానంలో ఉన్న ఏపీని జగన్రెడ్డి గంజాయి, డ్రగ్స్ రవాణాలో మొదటి స్థానానికి చేర్చారని ఆరోపించారు. విశాఖను స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి డ్రగ్స్ క్యాపిటల్గా మార్చారని ఆమె మండిపడ్డారు. ఈ సమావేశంలో టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షురాలు బయిరెడ్డి లీలావతి, జిల్లా మహిళా విభాగం అధికార ప్రతినిధి కింతాడ కళావతి తదితరులు పాల్గొన్నారు.