Share News

తాగునీటి కష్టాలు

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:36 AM

మండలంలోని జగన్నాథపురం గ్రామంలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి.

    తాగునీటి కష్టాలు
ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న జగన్నాథపురం గ్రామ మహిళలు

- ఖాళీ బిందెలతో మహిళల నిరసన

దత్తిరాజేరు, మార్చి 15: మండలంలోని జగన్నాథపురం గ్రామంలో తాగునీటి కష్టాలు నెలకొన్నాయి. రెండు నెలలుగా కొళాయిల ద్వారా తాగునీరు రాకపోవడంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు, నాయకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Mar 16 , 2024 | 12:36 AM