Share News

బహిరంగంగా తాగేస్తున్నారు

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:45 PM

రాజాంలో ఓ మద్యం దుకాణం వద్ద అనధికారికంగా పర్మిట్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. రహదారి చెంతే బహిరంగంగా తాగేందుకు అవకాశం ఇస్తున్నారు. ఆరుబయట, రోడ్డు పక్కన మందుబాబుల ఆగడాలతో అటువైపుగా వెళ్లిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి ఒక్క రాజాంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా ఉంది. మద్యం దుకాణాల సమీపంలో కిరాణా దుకాణం మాదిరి చిన్న షెడ్డు వేయడం అందులోనే తాగేందుకు అవకాశం ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. వాటి వల్ల స్థానికులు, అటుగా వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు.

బహిరంగంగా తాగేస్తున్నారు

బహిరంగంగా తాగేస్తున్నారు

- మద్యం దుకాణాల

చుట్టూ షాపులు

- పర్మిట్‌ లేకుండానే

తాగేందుకు అవకాశం

- జిల్లా వ్యాప్తంగా

సాగుతున్న తతంగం

- స్థానికులకు ఇబ్బందులు

- అటుగా వెళ్లే వారికి

ఆకతాయిలతో అవస్థలు

రాజాంలో ఓ మద్యం దుకాణం వద్ద అనధికారికంగా పర్మిట్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. రహదారి చెంతే బహిరంగంగా తాగేందుకు అవకాశం ఇస్తున్నారు. ఆరుబయట, రోడ్డు పక్కన మందుబాబుల ఆగడాలతో అటువైపుగా వెళ్లిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితి ఒక్క రాజాంలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా ఉంది. మద్యం దుకాణాల సమీపంలో కిరాణా దుకాణం మాదిరి చిన్న షెడ్డు వేయడం అందులోనే తాగేందుకు అవకాశం ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. వాటి వల్ల స్థానికులు, అటుగా వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు.

రాజాం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో 153 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. నిర్వహణలో నిబంధనలు మాత్రం పాటించడం లేదు. కొన్నిచోట్ల నిర్వాహకులే చుట్టుపక్కల ఉన్న షాపులను అద్దెకు తీసుకున్నారు. అక్కడ తమవారితోనే ఫాస్టుఫుడ్‌ సెంటర్లు, పాన్‌షాపులు ఏర్పాటుచేస్తున్నారన్న ఆరోపణ ఉంది. వాస్తవానికి మద్యం దుకాణాల వద్ద ప్రభుత్వం ఎటువంటి పర్మిట్‌ రూమ్‌లకు అనుమతివ్వలేదు. అక్కడే తాగేందుకు అవకాశమిస్తే ప్రభుత్వానికి అదనంగా రూ.5 లక్షలు కట్టాల్సి ఉంది. నోటిఫికేషన్‌లో ఈ విషయం స్పష్టంగా పేర్కొంది. ఒక వేళ షాపులో మద్యం నిల్వలకు స్థలం చాలకుంటే.. అదనంగా గోదాములు అద్దెకు తీసుకుని ఏడాదికి ప్రభుత్వానికి రూ.లక్ష వరకూ చెల్లించాల్సి ఉంటుంది. కాగా అదనంగా ప్రభుత్వానికి రూపాయి చెల్లించకుండా ఎక్కడి కక్కడే మద్యం దుకాణాల చుట్టూ షాపులు వెలుస్తున్నాయి. గోదాములు సైతం అనధికారికంగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అంతా సిండికేట్‌!

ఈసారి మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు పోటీపడ్డారు. వ్యాపారులే కాదు.. అన్నివర్గాల ప్రజలు మద్యం వ్యాపారంలోకి దిగారు. దీంతో రికార్డుస్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. అయితే డ్రా తీయడానికి ముందే చాలా మంది సిండికేట్‌గా మారారు. షాపులు ఎవరికి దక్కినా.. అందరికీ వాటాలు అన్నవిధంగా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలో లాటరీ తీసిన తరువాత కూడా ఒప్పందాలు జరిగాయి. జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. మండలంలో కనిష్టంగా ఐదు వరకూ షాపులను ఏర్పాటుచేశారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 7 నుంచి 10 వరకూ షాపులు ఏర్పాటయ్యాయి. కొన్ని షాపుల్లో రోజువారి విక్రయాలు అధికంగా ఉన్నాయి. మరికొన్ని వాటిలో ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగడం లేదు. విక్రయాలు తక్కువగా ఉన్నచోట ‘బెల్ట్‌’ను ప్రోత్సహిస్తున్నట్టు ఆరోపణలు న్నాయి.

బహిరంగ ప్రదేశాల్లో..

మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారితో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. క్రీడా మైదానాలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ఖాళీ స్థలాలు మందుబాబుల అడ్డాలుగా మారిపోయాయి. సాయంత్రం 5 గంటలు దాటితే చాలు మద్యం బాబుల సందడి ప్రారంభమవుతోంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరం. జిల్లాలో ఈ నిబంధన కనీసం అమలు కావడం లేదు.

అక్కడ అనుమతి లేదు

మద్యం దుకాణాల వద్ద తాగేందుకు అనుమతి లేదు. ఒకవేళ పర్మిట్‌ రూమ్‌లు కావాలంటే ప్రభుత్వానికి రూ.5 లక్షలు కట్టాలి. చిరుతిళ్ల దుకాణాల వద్ద తాగితే నేరం. బహిరంగ ప్రదేశాల్లో సైతం మద్యం తాగకూడదు. అలా తాగి దొరికితే మాత్రం కేసులు నమోదు చేస్తాం.

- ఆర్‌.జైభీమ్‌, సీఐ, రాజాం

---------------------------

Updated Date - Nov 13 , 2024 | 11:45 PM