మా ఆవేదన పట్టదా?
ABN , Publish Date - Jan 11 , 2024 | 12:18 AM
తమ ఆవేదన సర్కారుకు పట్టదా? అని సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు ప్రశ్నించారు. గత కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్ శిబిరం వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు.
![మా ఆవేదన పట్టదా?](https://media.andhrajyothy.com/media/2023/20231205/BELAGAM_2_AA_420471618f.gif)
బెలగాం, జనవరి 10: తమ ఆవేదన సర్కారుకు పట్టదా? అని సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు ప్రశ్నించారు. గత కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్ శిబిరం వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని, గతంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చిరుద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. నోటీసులతో భయాందోళనకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆ సంఘ నాయకులు స్పష్టం చేశారు.