వైభవంగా డోలోత్సవం
ABN , Publish Date - Mar 26 , 2024 | 11:23 PM
లివిరిలో గోపీనాఽథ రాధారాణి డోలోత్సవాలను ఘనంగా నిర్వహి స్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉత్సవాలు ప్రారంభమవగా.. ఆ గ్రామంలో భక్తజన సందడి నెలకొంది. రోజూ వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు.
![వైభవంగా డోలోత్సవం](https://media.andhrajyothy.com/media/2024/20240326/26_bhm_2_3ca87ba020.gif)
భామిని: లివిరిలో గోపీనాఽథ రాధారాణి డోలోత్సవాలను ఘనంగా నిర్వహి స్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉత్సవాలు ప్రారంభమవగా.. ఆ గ్రామంలో భక్తజన సందడి నెలకొంది. రోజూ వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయంలో రాధాకృష్ణలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా మంగళవారం రాధాకృష్ణ ఉత్సవ మూర్తులకు మేళతాళాలతో తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న, పెద్దా అంతా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని ఆటపాటలతో పురవీధుల్లో సందడి చేశారు. అనంతరం వంశధార నదిలో భక్తుల నడుమ రాధాకృష్ణ ఉత్సవ మూర్తులకు చక్రతీర్థ స్నానం చేశారు. పర్లాకిమిడికి చెందిన గజపతిరాజుల వారసురాలు కల్యాణి గజపతిరాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంతో పాటు సరిహద్దులో ఉన్న ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి, కాశీనగర్, గుణుపూర్ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు హోలీలో పాల్గొని రాధా పాదదర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.