పథకాల మంజూరులో వివక్ష
ABN , Publish Date - Jan 17 , 2024 | 11:45 PM
సంక్షేమ పఽథకాలు మంజూరులో దళితులపై అఽధికారులు వివక్ష చూపుతున్నారని దళిత నాయకులు టొంపల నర్సయ్య, కనిగిరి శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం విజయనగరంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ను నెల్లిమర్ల మండలానికి చెందిన దళిత నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఏళ్ల తరబడి సాగులో ఉన్న భూములకు సంబంధించి యాజమాన్య హక్కులు కల్పించేందుకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. దళితులపై దాడులు పెరిగిపోవడం తదితర అంశాలపై లిఖిత పూర్వకంగా వినతిప త్రం ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో చింతపల్లి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
![పథకాల మంజూరులో వివక్ష](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నెల్లిమర్ల: సంక్షేమ పఽథకాలు మంజూరులో దళితులపై అఽధికారులు వివక్ష చూపుతున్నారని దళిత నాయకులు టొంపల నర్సయ్య, కనిగిరి శ్రీనివాసరావు ఆరోపించారు. బుధవారం విజయనగరంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ను నెల్లిమర్ల మండలానికి చెందిన దళిత నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఏళ్ల తరబడి సాగులో ఉన్న భూములకు సంబంధించి యాజమాన్య హక్కులు కల్పించేందుకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. దళితులపై దాడులు పెరిగిపోవడం తదితర అంశాలపై లిఖిత పూర్వకంగా వినతిప త్రం ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో చింతపల్లి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.