Share News

సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:01 AM

మండలంలోని కుడుమూరు సర్వే నెంబరు 48లో సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలంటూ శనివారం గిరిజనులు ఆ గ్రామ సమీపంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి

పాచిపెంట: మండలంలోని కుడుమూరు సర్వే నెంబరు 48లో సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలంటూ శనివారం గిరిజనులు ఆ గ్రామ సమీపంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో గిరిజన రైతులు నిరసన చేశారు. గత ప్రభుత్వ హయాంలో పోరాటాలు చేసిన మేరకు సర్వే చేయించారని, అయినప్పటికీ పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే వివరాలు కూడా బయటపెట్టలేదని గిరిజన రైతులు సూకురు అప్పలస్వామి, జమ్ముల గోపాలరావు, కొర్ర కళ్యాణ్‌ శ్రీను తెలిపారు. రెవెన్యూ అధికారులు స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తామని గిరిజనులు స్పష్టం చేశారు.

Updated Date - Jun 09 , 2024 | 12:01 AM