Share News

పోలమాంబ ఆలయ హుండీల లెక్కింపు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:24 AM

శంబర పోలమాంబ ఆలయ హుండీలను బుధవా రం లెక్కించారు.

 పోలమాంబ ఆలయ హుండీల లెక్కింపు

మక్కువ: శంబర పోలమాంబ ఆలయ హుండీలను బుధవా రం లెక్కించారు. చదురు గుడి ఆలయం లో రూ.6,43,945, వనం గుడిలో రూ.2,24,004 మొత్తం రూ.8,67,951 ఆదాయం వచ్చింది. వెండి 158 గ్రాములు, బంగారం మూడు గ్రామాలు వచ్చింది. హుండీ లెక్కింపు కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా దేవదాయశాఖ అధికారి, జాతర ప్రత్యేక అధికారి డీవీవీ ప్రసాదరావు, ఆలయ కార్య నిర్వాహణాధికారి వీవీ సూర్యనారాయణ, ఎంపీటీసీ తీల్ల పోలినాయుడు, దాలినాయుడు, పోలీస్‌ సిబ్బంది, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:25 AM