పశుగణనకు సహకరించాలి: కోళ్ల
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:56 PM
పశుగణనకు అంద రూ సహకరించాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకు మారి కోరారు. శుక్రవారం మల్లివీడు పశువైద్య కేం ద్రంలో వైద్యులు ఎం.తులసి ఆధ్వ ర్యంలో పశుగణన కార్యక్రమం ప్రారం భించారు.

లక్కవరపుకోట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పశుగణనకు అంద రూ సహకరించాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకు మారి కోరారు. శుక్రవారం మల్లివీడు పశువైద్య కేం ద్రంలో వైద్యులు ఎం.తులసి ఆధ్వ ర్యంలో పశుగణన కార్యక్రమం ప్రారం భించారు. ఈ సందర్భంగా18 రకాల గణనకు సంబంధించి పోస్టర్ విడు దలచేశారు. కార్యక్రమంలో ఏడీలు చలపతిరావు, గంగాధర్ పాల్గొన్నారు.
ఫచీపురుపల్లి, అక్టోబరు 25 (ఆంధ్ర జ్యోతి):పశగణనకు సంబంధిం చిన గోడ పత్రికను ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఏడీ శారద, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ డెంకాడ, అక్టోబరు 25 ( ఆంధ్రజ్యోతి): మండలంలోని పోలిపల్లి పశువుల ఆసుపత్రిలో భోగాపురం అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీ మహాపాత్రో ఆధ్వర్యంలో 21వ అఖిల భారత పశుగణన మార్క్ఫైడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో నెల్లిమర్ల అసిస్టెంట్ డైరక్టర్ చక్రవర్తి, అక్కివరం పశువైద్యాధికారి శ్రీకాంత్ పాల్గొన్నారు.