టీడీపీలో కొనసాగుతున్న చేరికలు
ABN , Publish Date - Apr 25 , 2024 | 12:43 AM
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి.
పార్వతీపురం, ఆంధ్రజ్యోతి/ సీతానగరం: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. బుధవారం సీతానగరం మండలం పెదభోగిలి గ్రామానికి చెందిన మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు ఈజ్జాడ సింహాచలంతో పాటు రాంబాబు, శివరాం లక్ష్మణరావు, గోవింద్ సింహాచలం, రాము, అప్పలనాయుడు తదితర వంద కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరందరికీ పార్వతీపురంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర కండువా వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీతానగరం మండల నాయకులు సత్యంనాయుడు, వేణుగోపాల్ నాయుడు పాల్గొన్నారు.