Share News

కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:08 AM

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా నుంచి మూడు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు.

 కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు

పార్వతీపురం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా నుంచి మూడు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. పార్వతీపురం నియోజకవర్గం నుంచి బి.మోహన్‌రావు, పాలకొండ నుంచి ఎస్‌.చంటిబాబు, సాలూరు నుంచి మువ్వల పుష్పారావు ఎన్నికల బరిలో నిలవనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. అయితే కురుపాం నియోజకవర్గ అభ్యర్థి పేరును మాత్రం ఇంకా వెల్లడించలేదు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని సీపీఎంకు కేటాయించనున్నట్లు సమాచారం.

Updated Date - Apr 03 , 2024 | 12:08 AM