ఎమ్మెల్యేలకు అభినందనల వెల్లువ
ABN , Publish Date - Jun 08 , 2024 | 12:38 AM
నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన లోకం నాగ మాధవిని నియోజకవర్గ, జిల్లా అధికారులు శుక్రవారం ముంజేరు సమీప జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి అభినందనలు తెలియజేశారు.
![ఎమ్మెల్యేలకు అభినందనల వెల్లువ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
భోగాపురం: నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన లోకం నాగ మాధవిని నియోజకవర్గ, జిల్లా అధికారులు శుక్రవారం ముంజేరు సమీప జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి అభినందనలు తెలియజేశారు. విజయవాడ నుంచి గురువారం రాత్రి ఎమ్మెల్యే నాగమాధవి స్వగృహం చేరుకోవడంతో ఆమెను అధికా ర యంత్రాంగం కలిసి పూలమాలలు, బొకేలతో అభినందనలు తెలియజేశారు. భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల నుంచే కాకుండా జిల్లా నుంచి అనేక మంది శాఖలుగా వచ్చి ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సాలూరు రూరల్: సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణికి శుక్రవారం అధికారులు, అభిమానులు తరలివచ్చి అభినందనలు తెలిపారు. సాలూరు అర్బన్, రూరల్ సీఐలు వాసు నాయుడు, బాలకృష్ణ, ఎస్ఐలు ఎం.వెంకటరమ ణ, సీతారాం తదితరులు, పోలీసు సిబ్బంది ఆమెకు మొక్కలు ఇచ్చి అభినంద నలు తెలిపారు. జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో డి.శివకుమార్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది వివిధ శాఖల అధికారులు ఆమెకు అభినందనలు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పోలీసులు సంయమనం పాటించి సజావుగా జరిగేలా చేశారని సంధ్యారాణి కితాబిచ్చారు.
పాలకొండ: పాలకొండ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నాయకురాలు తేజోవతి, బీజేపీ నాయకురాలు తాడంగి సునీత జయ కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన కూటమి నాయకులం దరికీ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
వీరఘట్టం: రాజపురంలో ఎమ్మెల్యే జయకృష్ణకు పాలకొండ, భామిని, సంతకవిటి, వీరఘట్టం మండలాల నుంచి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, అధికారులు తరలివచ్చి అభినందనలు తెలిపారు. వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.