దుష్ప్రచారంపై ఫిర్యాదు
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:16 AM
ఎస్.కోట నియోజకవర్గ మాజీ ఎమ్మె ల్యే కోళ్ల లలితకుమారి కుటుంబంపై గుర్తుతెలి యని వ్యక్తి సోషల్ మీడియా ద్వా రా దుష్ప్రచారం చేయడాన్ని గమనించిన టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి సాగర్ కల్యాణ్ ఆదివారం సాయంత్రం స్థానిక పోలీసు స్టేషన్లో కార్యకర్తలతో కలిసి ఫిర్యాదు చేశారు
![దుష్ప్రచారంపై ఫిర్యాదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
లక్కవరపుకోట, మార్చి 3: ఎస్.కోట నియోజకవర్గ మాజీ ఎమ్మె ల్యే కోళ్ల లలితకుమారి కుటుంబంపై గుర్తుతెలి యని వ్యక్తి సోషల్ మీడియా ద్వా రా దుష్ప్రచారం చేయడాన్ని గమనించిన టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి సాగర్ కల్యాణ్ ఆదివారం సాయంత్రం స్థానిక పోలీసు స్టేషన్లో కార్యకర్తలతో కలిసి ఫిర్యాదు చేశారు. టిక్కెట్ విషయంలోనూ, కుటుంబం ఆరోగ్యంపైనా, లోకే ష్ కోళ్ల కుటుంబానికి అన్యాయం చేసినట్లుగా తప్పుడు వార్తలు సృష్టించి ప్రచా రాలు చేస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అజ్ఞాత వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ చెప్పారన్నారు. అక్కిరెడ్డి రమ ణ, మల్లా రామకృష్ణ, కొటాన విజయ్కుమార్, భూపాల్నాయుడు తదితరులు పాల్గొన్నారు.