రైతులపై వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి
ABN , Publish Date - Feb 25 , 2024 | 12:28 AM
:ఉత్తరాంరఽధ సుజల స్రవంతి కాలువల అలైన్మెంట్ కోరు తున్న రైతులను హేలన చేస్తూ రైతులకు ఏం తెలుసు వారేమైనా ఇంజి నీర్లా అంటూ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకో వాలని సీపీఎం రాష్ట్ర నాయకులు ఎం.కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి సూర్య నారాయణ, రైతు సంఘ కార్యదర్శి బి.రాంబాబు డిమాండ్చేశారు. శనివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ పెద్దగెడ్డ, తోటపల్లి ప్రాజెక్టు విష యంలో ముంపు గ్రామాల అంచనావేయడంలో ఇంజినీర్లు విఫలమయ్యారని ఆరోపించారు. రైతులకు ఇంజినీరింగ్ పరిజ్ఞానం లేకపోయినా జరుగుతున్న పరిణామాలను అంచనావేసి చెప్పగలిగే జ్ఞానం ఉందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణంలో ఎక్కువ మంది రైతులు భూములు కోల్పోతున్నారని, కాలువ అలైన్మెంట్ మార్చితే మంచిదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులతో నిపుణుల కమిటీని వేసి వారిచ్చిన రిపోర్టు ప్రకారం అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు.
![రైతులపై వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
దాసన్మనపేట:ఉత్తరాంరఽధ సుజల స్రవంతి కాలువల అలైన్మెంట్ కోరు తున్న రైతులను హేలన చేస్తూ రైతులకు ఏం తెలుసు వారేమైనా ఇంజి నీర్లా అంటూ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకో వాలని సీపీఎం రాష్ట్ర నాయకులు ఎం.కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి సూర్య నారాయణ, రైతు సంఘ కార్యదర్శి బి.రాంబాబు డిమాండ్చేశారు. శనివారం విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ పెద్దగెడ్డ, తోటపల్లి ప్రాజెక్టు విష యంలో ముంపు గ్రామాల అంచనావేయడంలో ఇంజినీర్లు విఫలమయ్యారని ఆరోపించారు. రైతులకు ఇంజినీరింగ్ పరిజ్ఞానం లేకపోయినా జరుగుతున్న పరిణామాలను అంచనావేసి చెప్పగలిగే జ్ఞానం ఉందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణంలో ఎక్కువ మంది రైతులు భూములు కోల్పోతున్నారని, కాలువ అలైన్మెంట్ మార్చితే మంచిదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులతో నిపుణుల కమిటీని వేసి వారిచ్చిన రిపోర్టు ప్రకారం అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు.