Share News

కూటమి అభ్యర్థుల ప్రచారం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:15 AM

ప్రజలతో మమేకమై పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు.

కూటమి అభ్యర్థుల ప్రచారం

గురుగుబిల్లి: ప్రజలతో మమేకమై పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. గురువారం ఉల్లిభద్ర జంక్షన్‌ నుంచి గిజబ గ్రామం వరకు భారీ బైకు ర్యాలీ నిర్వహించారు. కొత్తపల్లి గీత తోపా టు, కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి కలిసి ప్రచార రథంపై రోడ్‌షో చేశారు. జగదీశ్వరి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్త లు పనిచేయాలని కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యరద్శి వైరిచర్ల వీరేష్‌చంద్రదేవ్‌, టీడీపీ నాయకులు దత్తి లక్ష్మణరావు, ద్వారపురెడ్డి సత్యనారాయణ, బీజేపీ నాయకుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, జనసేన నాయులు కడ్రక మల్లేష్‌, టీడీపీ నాయకులు ఎం.పుషోత్తమునాయుడు, అంబటి రాంబాబు, కోట భరత్‌ కుమార్‌, జగదీష్‌, నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచారానికి ముందుగా అభ్యర్థులు తోటపల్లిలో గల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:15 AM