Share News

చీపురుపల్లిని సస్యశ్యామలం చేస్తా: కళా

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:22 AM

చీపురుపల్లి నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చి రైతుల కోసం తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని కూటమి అభ్యర్థి కిమిడి కళావెంకటరావు అన్నారు.

  చీపురుపల్లిని సస్యశ్యామలం చేస్తా: కళా

గుర్ల: చీపురుపల్లి నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా మార్చి రైతుల కోసం తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని కూటమి అభ్యర్థి కిమిడి కళావెంకటరావు అన్నారు. పల్లిగండ్రేడు, కొండగండ్రే డు, ముద్దాడపేట తదితర గ్రామాల్లో ఆయన మంగళవారం ఎన్నికల సభలు నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు సీహెచ్‌ మహేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గడ్డిగెడ్డలోకి సాగునీరు అందించే బాధ్యత తీసుకుంటానన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రామ్‌మల్లిక్‌నాయుడు, పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి వి.సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

రాక్షస పాలనకు చరమగీతం పాడాలి

గరివిడి: రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనకు చరమగీతం పాడాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన పార్టీ అనుబంధ విభాగాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 12:22 AM