చంద్రబాబు పర్యటనలో మార్పు
ABN , Publish Date - Apr 20 , 2024 | 12:00 AM
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడి శృంగవరపుకోట ఎన్నికల ప్రచార సభలో మార్పు జరిగింది.
చంద్రబాబు పర్యటనలో మార్పు
ఎస్.కోటకు ఈనెల 21కి బదులు 22న రాక
శృంగవరపుకోట ఏప్రిల్ 19: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడి శృంగవరపుకోట ఎన్నికల ప్రచార సభలో మార్పు జరిగింది. ఈనెల 21కి బదులు 22న సాయంత్రం 4గంటలకు వస్తున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బుచ్చి అప్పలరామప్రసాద్ తెలిపారు. తొలుత ఈనెల 21 వస్తారని టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి సమాచారం అందింది. అయితే శుక్రవారం నాటికి మార్పులు చేస్తూ అధిష్టానం నుంచి సమాచారం అందింది. 22న వస్తున్నట్లు చెప్పడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజు రాత్రి స్థానికంగా ఉన్న శిరికి రిసార్ట్లో బస చేయనున్నట్లు సమాచారం. లక్కవరపుకోట మండలం రంగారాయపురంలో హెలిపాడ్ ఏర్పాటుకు స్థలం పరిశీలన చేస్తున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎస్.కోటకు చేరుకుంటారు.
--------------