నేడు చంద్రబాబు రాక
ABN , Publish Date - May 08 , 2024 | 11:06 PM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం చీపురుపల్లి రానున్నారు. ఉదయం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరగనున్న సభలో ఆయన పాల్గొంటారు.
నేడు చంద్రబాబు రాక
ఏర్పాట్లు పూర్తిచేసిన టీడీపీ శ్రేణులు
చీపురుపల్లి, మే 8: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం చీపురుపల్లి రానున్నారు. ఉదయం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరగనున్న సభలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో నేరుగా చీపురుపల్లి చేరుకుంటారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా రోడ్ షో నిర్వహిస్తారు. చంద్రబాబు రాకకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున బుధవారం పరిశీలించారు. ఆంజనేయపురంలో హెలిప్యాడ్ స్థలాన్ని పార్టీ నాయకులు కిమిడి సూరపునాయుడు, దివాకర్ తదితరులతో కలిసి సందర్శించారు. డీఎస్పీ ఏఎస్ చక్రవర్తి, సీఐ షణ్ముఖరావు, ఎస్ఐ కె.కిరణ్కుమార్నాయుడు కూడా హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు.
---------------