Share News

10న చంద్రబాబు సభ

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:02 AM

కోటలో టీడీపీ నేతల సమావేశం బొబ్బిలి, జనవరి 6: ఈ నెల 10న బొబ్బిలి సంస్థానం హైస్కూలు మైదానంలో నిర్వహించననున్న రా.. కదలిరా బహిరంగ సభకు సన్నాహాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

10న చంద్రబాబు సభ
బొబ్బిలికోటలో మూడు జిల్లాల టీడీపీ ముఖ్యనేతల సమావేశం

10న చంద్రబాబు సభ

సన్నాహాలపై బొబ్బిలి కోటలో టీడీపీ నేతల సమావేశం

బొబ్బిలి, జనవరి 6: ఈ నెల 10న బొబ్బిలి సంస్థానం హైస్కూలు మైదానంలో నిర్వహించననున్న రా.. కదలిరా బహిరంగ సభకు సన్నాహాలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనిపై చర్చించేందుకు బొబ్బిలి కోటలో మూడు జిల్లాల ముఖ్యనేతలు శనివారం సమావేశమయ్యారు. వివిధ అంశాల వారీగా బాధ్యతలు తీసుకున్నారు. ఎంతమంది జనం వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని తీర్మానించారు. మాజీ మంత్రులు కిమిడి కళావెంకటరావు, కె.ప్రతిభాభారతి, ఆర్‌వీ సుజయ్‌కృష్ణరంగారావు, కోండ్రు మురళి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, నియోజకవర్గ ఇన్‌చార్జిలు బేబీనాయన, పూసపాటి అదితిగజపతిరాజు, తెంటు లక్ష్మునాయుడు, ఆర్‌పీ భంజ్‌దేవ్‌, గుమ్మిడి సంధ్యారాణి, కేఏ నాయుడు, బొబ్బిలి చిరంజీవులు, ఐవీపీ రాజు, నెలిమర్ల నియోజకవర్గ నాయకుడు సువ్వాడ రవిశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మకమైన బొబ్బిలి పట్టణంలో చంద్రబాబు సభకు జనం అధికంగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జగన్‌ పాలనతో జనమంతా విసిగిపోయారని, చంద్రబాబు రావాలని గట్టిగా కోరుకుంటున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.

Updated Date - Jan 07 , 2024 | 12:02 AM