Share News

రైతుల పక్షపాతి చంద్రబాబు

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:53 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

రైతుల పక్షపాతి చంద్రబాబు

పార్వతీపురం రూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పెద్దమం డపల్లి గ్రామంలో సోమవారం రైతులకు ఎరువులు పంపిణీ చేశా రు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రైతుల విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి నిర్లక్ష్యం వహించా రన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు.విత్తనాలు, ఎరువులు సరఫరా చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, గురజాన చంద్రమౌళి, బార్నాల సీతారాం, చుక్కఅచ్యుత, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే విజయచంద్రను టీడీపీ నాయకులు, కార్య కర్తలు సన్మానించారు. ఊరేగింపుగా సభా వేదిక వద్దకు తీసుకుని వెళ్లారు.

Updated Date - Jul 08 , 2024 | 11:53 PM