పశువులు మృతి
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:16 AM
మండలంలోని ఎంకెవలస గ్రామంలో చింతపల్లి కృష్ణకు చెందిన మూడు పశువులు మంగళవారం ఉదయం ఆరుగంటల సమయంలో మృతిచెందాయి. ఈసంఘటనకు సంబందించి స్దానికులు పశుసంవర్ధకశాఖ ఏడీ రెడ్డి కృష్ణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
![పశువులు మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
జామి: మండలంలోని ఎంకెవలస గ్రామంలో చింతపల్లి కృష్ణకు చెందిన మూడు పశువులు మంగళవారం ఉదయం ఆరుగంటల సమయంలో మృతిచెందాయి. ఈసంఘటనకు సంబందించి స్దానికులు పశుసంవర్ధకశాఖ ఏడీ రెడ్డి కృష్ణ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. చింతపల్లి కృష్ణ ఉదయం ఆరుగంటల సమయంలో తన ఒక గెదె, ఒక ఆవుపడ్డ, ఒక గెదెపడ్డలకు ఒకేసారి దాణా వేశాడు. ఆ వెంటనే ఒకేసారి మూడు పశువులు మృతిచెందాయి. సమాచారం అందుకున్న మండల పశువైద్యాధికారి నాయుడు, జిల్లా పశువైద్యాధికారులను రప్పించి ఘటనా స్థలంలో పోస్టుమార్టం చేయించారు. వీటి మరణాలకు గల కారణం నివేదిక వచ్చాక తెలుస్తుందని వైద్యులు తెలిపారు. ఈ ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.