వంతెన పనులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Mar 27 , 2024 | 12:19 AM
సువర్ణముఖి నదిపై సీతానగరం వద్ద అసంపూర్తిగా ఉన్న వంతెన పనులు పూర్తి చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర డిమాండ్ చేశారు.
సీతానగరం: సువర్ణముఖి నదిపై సీతానగరం వద్ద అసంపూర్తిగా ఉన్న వంతెన పనులు పూర్తి చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన టీడీపీ మండల నాయకులతో కలిసి పాత, కొత్త వంతెనలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత వంతెన శిథిలావస్థలో ఉందని కొత్త వంతెన నిర్మాణానికి రూ.12కోట్లు నిధు లు మంజూరు చేసి, ఏడేళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే మిగిలిందన్నారు. పాత వంతెనకు మరమ్మత్తుల పేరిట రూ.1.29కోట్లు ఖర్చు చేసినా, పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపట్టలేదని ఆరోపించారు. పాత వంతెన ఎప్పుడు కూలిపోతుం దోనని అన్ని వర్గాల వారు భయాందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే నూతన వంతెన పనులు పునః ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట మండల నాయకులు సత్యంనాయుడు, వేణుగోపాల్నాయుడు, తెంటు వెంకటఅప్పల నాయుడడు, కె.అర వింద్, సూర్యనారాయణ, సింహాలనాయుడు పాల్గొన్నారు.