అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి
ABN , Publish Date - Apr 17 , 2024 | 12:27 AM
అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతులపై ప్రజలు అవగాహన కలిగి ఉం డాలని ఐటీడీఏ పీవో కల్పనాకుమారి తెలిపారు.
![అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సీతంపేట: అగ్ని ప్రమాదాల నివారణ పద్ధతులపై ప్రజలు అవగాహన కలిగి ఉం డాలని ఐటీడీఏ పీవో కల్పనాకుమారి తెలిపారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకుని నివారణా పద్ధతు లను తెలిపే కరపత్రాన్ని పీవో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అప్రమత్తం చే యాలని సిబ్బందికి సూచించారు. అగ్నిమాపక కేంద్రం ల్యాండ్లైన్ 08941-260111 అందరికీ తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు పాల్గొన్నారు.