చెత్త కుండీలో శిశువు మృతదేహం
ABN , Publish Date - May 19 , 2024 | 12:14 AM
విజయనగరం పట్టణంలోని గంటస్తంభం సమీ పంలోని చెత్త కుండీలో ఓ శిశువు మృతదేహాన్ని స్థానికులు శనివారం సాయంత్రం గుర్తించారు.
![చెత్త కుండీలో శిశువు మృతదేహం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
-అట్టపెట్టెలో పెట్టి పడేసిన వైనం
విజయనగరం క్రైమ్, మే 18: విజయనగరం పట్టణంలోని గంటస్తంభం సమీ పంలోని చెత్త కుండీలో ఓ శిశువు మృతదేహాన్ని స్థానికులు శనివారం సాయంత్రం గుర్తించారు. మృత శిశువును ఒక అట్టపెట్టెలో పెట్టి పడేసినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాకబు చేశారు. సీఐ రామారావు ఆధ్వర్యంలో పసికందు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ దారుణానికి పాల్పడిన వారిని ప్రజలు శాపనార్దాలు పెట్టారు.