ఆటో బోల్తా.. వ్యక్తి మృతి
ABN , Publish Date - Apr 12 , 2024 | 12:34 AM
ఆటో బోల్తా పడిన ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. గురువారం సాయంత్రం పార్వతీపురం మండలంలోని హెచ్.కా రాడవలస గ్రామ సమీపంలో తాళ్లబురిడి గ్రామం నుంచి నిడగల్లు గ్రామానికి వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడిండి.
![ఆటో బోల్తా.. వ్యక్తి మృతి](https://media.andhrajyothy.com/media/2024/20240407/hh_4656622f24.jpg)
పార్వతీపురం టౌన్/ పార్వతీపురం రూరల్ : ఆటో బోల్తా పడిన ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. గురువారం సాయంత్రం పార్వతీపురం మండలంలోని హెచ్.కా రాడవలస గ్రామ సమీపంలో తాళ్లబురిడి గ్రామం నుంచి నిడగల్లు గ్రామానికి వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడిండి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పైలా సింహాచలం(68), సుబ్బలక్ష్మి, అనూషాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా ఆసుపత్రికి తీసుకువస్తున్న సమయంలో పైలా సింహచలం మృతి చెందినట్లు రూరల్ పోలీసులు, బంధువులు తెలిపారు.