అచ్చెన్నకు అశోక్ గజపతిరాజు పరామర్శ
ABN , Publish Date - Apr 07 , 2024 | 12:21 AM
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నా యుడు తల్లి కళావతమ్మ మృతికి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు సంతాపం వ్యక్తం చేశారు.
![అచ్చెన్నకు అశోక్ గజపతిరాజు పరామర్శ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విజయనగరం రూరల్: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నా యుడు తల్లి కళావతమ్మ మృతికి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వెళ్లి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నా యుడులను పరామర్శించారు. కళావతమ్మ చిత్రపటానికి అశోక్ గజపతిరాజు పూలమాల వేసి నివాళులు అర్పించారు.