Share News

7న లోకేష్‌ రాక

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:26 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు.

7న లోకేష్‌ రాక
పార్వతీపురంలో స్థల పరిశీలన చేస్తున్న టీడీపీ నేతలు

పార్వతీపురం, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ రాష్ట్ర వర్గాల సమాచారం మేరకు ఈ నెల 6న రాత్రి పాలకొండకు లోకేష్‌ చేరుకుని అక్కడే బస చేస్తారు. 7న ఉదయం పాలకొండ , మధ్యాహ్నం కురుపాం, సాయంత్రం పార్వతీపురం నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. 8న సాలూరుకు చేరుకుంటారు. ఆయా చోట్ల బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే ఇందుకు సంబంధించి సాలూరు, పాలకొండ, కురుపాం, పార్వతీపురంలో నియోజకవర్గ ఇన్‌చార్జిలు గుమ్మిడి సంధ్యారాణి, నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి, బోనెల విజయచంద్ర, ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి నాయకులు వాటిని పరిశీలించి వెళ్లారు.

Updated Date - Feb 01 , 2024 | 11:26 PM