జిల్లాకు చంద్రబాబు, పవన్ రాక
ABN , Publish Date - Apr 13 , 2024 | 12:11 AM
ఎన్నికల ప్రచారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జిల్లాకు రానున్నారు.
![జిల్లాకు చంద్రబాబు, పవన్ రాక](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- 15న టీడీపీ అధినేత..
- 16న ఉమ్మడిగా రోడ్షో
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
ఎన్నికల ప్రచారం కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జిల్లాకు రానున్నారు. కూటమి అభ్యర్థుల తరఫున వీరు ప్రచారం చేయనున్నారు. ఈ నెల 15న ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా రాజాంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మరుసటి రోజు 16న చీపురుపల్లి మీదుగా నెల్లిమర్లకు చేరుకుంటారు. అదే రోజున పవన్కల్యాణ్ వారహి యాత్రలో భాగంగా నెల్లిమర్ల రానున్నారు. చంద్రబాబు, పవన్ ఉమ్మడిగా నెల్లిమర్లలో రోడ్షో నిర్వహించనున్నారు. రామతీర్థం కూడలిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. తరువాత విజయనగరం చేరుకుని అంబేడ్కర్(బాలాజీ) కూడలిలో ప్రసంగిస్తారు. ఇందుకు సంబంధించి ఇరుపార్టీల నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో(అశోక్ బంగ్లా) నియోజకవర్గ నేతలతో కేంద్ర మాజీ మంత్రి అశోక్గజపతిరాజు సన్నాహక సమావేశం నిర్వహించారు. జన సమీకరణపై చర్చించారు. అలాగే, అంబేడ్కర్ కూడలిలో రోడ్షో ప్రసంగ స్థలాన్ని అదితి గజపతిరాజు, తదితరులు పరిశీలించారు. తమ అధినేతల పర్యటనలు విజయవంతం చేసేందుకు ఇరు పార్టీల నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.