Share News

స్పందన అర్జీలకు సరైన పరిష్కారం చూపాలి

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:22 AM

స్పందనలో ప్రజలు ఇచ్చే అర్జీలకు వారు సంతృ ప్తిచెందే విధంగా సరైన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అధికా రులను ఆదేశించారు.

స్పందన అర్జీలకు సరైన పరిష్కారం చూపాలి

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: స్పందనలో ప్రజలు ఇచ్చే అర్జీలకు వారు సంతృ ప్తిచెందే విధంగా సరైన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అధికా రులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరం లో జేసీ ఆర్‌.గోవిందరావు, ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్‌, డీఆర్వో జె.వెంకటరావు, కేకేఆర్సీ ఎస్‌డీసీ జి.కేశవనాయుడులతో కలిసి స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సీతానగరం మండలం తుమరాడ గ్రామానికి చెందిన గొల్ల రఘునాయుడుకు వినికిడి మిషన్‌, పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామా నికి చెందిన జి.పైడయ్యకు బలిజిపేట మండలం గౌరీపురం గ్రామానికి చెందిన ఎస్‌.వాసుదేవరావుకు, జియ్యమ్మవలస గ్రామానికి చెందిన రాయల సత్యనారా యణకు ట్రై సైకిళ్లను జేసీ ఆర్‌.గోవిందరావు, ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్‌ అందించా రు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారి ఓ.ప్రభాకరరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్‌.శివప్రసాద్‌, జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్‌పాల్‌, బీసీ వెల్ఫేర్‌ అధికారి ఎస్‌.కృష్ణ, సర్వే ఏడీ కె.రాజ్‌కుమార్‌, జిల్లా మత్స్యశాఖాధికారి జి.తిరుపతయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:22 AM