బొబ్బిలి ఎమ్మెల్యేకి మరో షాక్
ABN , Publish Date - Jan 08 , 2024 | 12:07 AM
బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడుకు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్యే మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులంతా టీడీపీలోకి క్యూ కడుతున్నారు.
![బొబ్బిలి ఎమ్మెల్యేకి మరో షాక్](https://media.andhrajyothy.com/media/2023/20231205/7_TLM_2_5366e8c60f.gif)
వైసీపీ సర్పంచ్, వార్డు సభ్యులు టీడీపీలో చేరిక
తెర్లాం, జనవరి 7: బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడుకు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్యే మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకులంతా టీడీపీలోకి క్యూ కడుతున్నారు. ఇటీవలే ఎమ్మెల్యే సొంత గ్రామంలో కూడా ముఖ్య నాయకులు సైకిల్ ఎక్కారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో అధికారపార్టీకి పెద్ద దెబ్బేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా తెర్లాం మండలం పెరుమాళి గ్రామ సర్పంచ్ సాగిరాజుహేమలత వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బేబీనాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు సమక్షంలో వారితో పాటు వార్డుమెంబర్లు, మరో 250 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వైసీపీలో బాధలు భరించలేకే తాము టీడీపీలో చేరామని వారు ప్రకటించారు. అంతకుముందు టెక్కలివలసలో పది కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారని టీడీపీ మండల అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటనాయుడు తెలిపారు.