Share News

అరాచక పాలనకు ముగింపు పలకాలి

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:29 AM

రాష్ట్రంలో అరాచక పాలనకు ముగింపు పలకాలని సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.

అరాచక పాలనకు ముగింపు పలకాలి

మెంటాడ: రాష్ట్రంలో అరాచక పాలనకు ముగింపు పలకాలని సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. మండలంలోని కొంపంగి, కైలాం గ్రామాల్లో ఆమె గురువారం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్ర మంలో కూనిబిల్లి సింహాచలం వర్గీయులు సుమారు 100 మంది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. సంధ్యారాణి వారికి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - Apr 05 , 2024 | 12:29 AM