Share News

అరాచక పాలనకు స్వస్తి పలకాలి

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:04 AM

వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలని టీడీపీ నెల్లిమర్ల నియో జకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు పిలుపునిచ్చారు.

 అరాచక పాలనకు స్వస్తి పలకాలి

భోగాపురం: వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలని టీడీపీ నెల్లిమర్ల నియో జకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు పిలుపునిచ్చారు. పోలిపల్లి గ్రామంలో ఆయన శనివారం మాట్లాడుతూ నాలుగున్నరేళ్లగా వైసీపీ అరాచక పాలన చేస్తోందని, దీనికి స్వస్తి పలికే విధంగా ప్రజలు సిద్ధం కావాలన్నారు. రా.. కదిలి రా.. కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యం పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అప్పలస్వామి, కర్రోతురాజు తదితరులు పాల్గొన్నారు. ఫ బొండపల్లి: బొబ్బిలిలో ఈనెల 10న జరగనున్న తెలు గుదేశం రా.. కదలి రా... సభను విజయవంతం చేయాలని టీడీపీ గజపతినగరం ని యోజకవర్గ ఇన్‌చార్జి కేఏ నాయుడు కోరారు. శనివారం నెలివాడ జంక్షన్‌లోని ప్రైవే టు ఫంక్షన్‌ హాలులో టీడీపీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్షేత్ర స్థాయి నుంచి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనేలా పని చేయాలన్నారు. టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు పాశర్ల ప్రసాద్‌ మాట్లాడుతూ కార్యకర్తలు గ్రామాల్లో సైనికుల్లా పనిచేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోరాడ కృష్ణ, తెలుగు యువత అధ్యక్షుడు వి.చైతన్య, మాజీ జడ్పీటీసీ బి.బాలాజీ, నాయకుడు పి.కృష్ణమూర్తినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:04 AM