19న గురుకులాల్లో ప్రవేశాలు
ABN , Publish Date - Apr 18 , 2024 | 12:22 AM
గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని డా.బీఆర్ అంబేద్కర్ పాఠశాల ప్రిన్సిపాల్ విజయనిర్మల కోరారు.
భామిని: గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి విద్యార్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలని డా.బీఆర్ అంబేద్కర్ పాఠశాల ప్రిన్సిపాల్ విజయనిర్మల కోరారు. 2023-24 సంవత్సరానికి ఐదో తరగతి ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు 19వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం, శ్రీకాకుళంలోని పెద్దపాడు పాఠశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నట్టు తెలిపారు. విద్యార్థుల తల్లిదం డ్రులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. భామిని గురుకులంలో 47 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆమె చెప్పారు. అలాగే ఈనెల 14వ తేదీన ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశానికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల్లోపు పరీక్షలను నిర్వహిస్తామని శివకుమార్ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యా ర్థులు హాల్టికెట్ డౌన్లోడ్ చేసి పరీక్షకు హాజరు కావాలన్నారు. వంద సీట్లు ఖాళీగా ఉండగా 215 మంది దరఖాస్తు చేసినట్టు తెలిపారు. అధిక మార్కులు సాధించిన వారికి కేటగిరీ ప్రాప్తికి ప్రవేశాలు చేపడతామని ప్రిన్సిపాల్ చెప్పారు.