Share News

అదితి గజపతిరాజు ప్రచారం

ABN , Publish Date - Apr 13 , 2024 | 12:27 AM

రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజెపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తనను, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుని గెలిపించాలని కోరుతూ అదితి గజపతిరాజు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 11వ డివిజన్‌ పరిధిలో ఇంటింటికి వెళ్లి శుక్రవారం ప్రచారం నిర్వహించారు.

అదితి గజపతిరాజు ప్రచారం

విజయనగరం రూరల్‌ : రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజెపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తనను, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుని గెలిపించాలని కోరుతూ అదితి గజపతిరాజు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి 11వ డివిజన్‌ పరిధిలో ఇంటింటికి వెళ్లి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. అంబటి సత్తర్వు, ఘోషాసుపత్రి ఏరియా మీదుగా కాటవీధి జంక్షన్‌ వరకూ ఆమె పర్యటించారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, సైకిల్‌ గుర్తుపై ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. నగరంలోని నాలుగో డివిజన్‌లో టీడీపీ నగర అధ్యక్షుడు ప్రసాదుల ప్రసాద్‌ శుక్రవారం కొత్తపేట, నీళ్లట్యాంకు ఒడ్డున నివసిస్తున్న ఓటర్ల వద్దకు వెళ్లారు. టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, ఆదితి గజపతిరాజును గెలిపించా లని కోరారు. నగరంలోని ఒకటో డివిజన్‌ వేణుగోపాలపురంలో శుక్రవారం రాత్రి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. టీడీపీ నాయకులు మురగడాపు పార్వతి, నక్కిళ్ల శ్రీనివాసరావు, బొద్దాన లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2024 | 12:27 AM