Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:15 AM

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి జనాలను తరలి స్తున్న ఆటో ఢీకొని మోటారుబైకుపై వెళుతున్న యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

బొబ్బిలి: వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికి జనాలను తరలి స్తున్న ఆటో ఢీకొని మోటారుబైకుపై వెళుతున్న యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఏఎస్‌ఐ జి.భాస్కరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. తెర్లాం మండలం కూనాయవలస నుంచి వైసీపీ తరపున జనాలను తరలించి వెళుతున్న ఆటో స్థానిక శ్రీకళాభారతి ఆడిటోరియం జంక్షన్‌ దగ్గర రాజాన దిలీప్‌ అనే యువకుడిని బలంగా ఢీకొంది. బొబ్బిలి రంగరాయపురం గ్రామానికి చెందిన దిలీప్‌ ప్రైవేట్‌ కొరియర్‌ సంస్థలో డెలివరీబాయ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం కళాభారతి పక్క సందు నుంచి బైకుపై వస్తుండగా ఆటో ఢీకొంది. ఈ ప్రమాదం లో దిలీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సీహెచ్‌సీలో ప్రాథమిక చికి త్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో కూనాయవలసకు చెందిన ఆటో డ్రైవర్‌ సింహాచలంను అరెస్టు చేసినట్లు ఏఎస్‌ఐ భాస్కరరావు తెలిపారు.

Updated Date - Apr 20 , 2024 | 12:15 AM